తల్లి మందలించడంతో ఆత్మహత్య

by Disha Web Desk 22 |
తల్లి మందలించడంతో ఆత్మహత్య
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): తల్లి మందలించడంతో మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య చేసుకుంది. అర్వపల్లి ఎస్ఐబీ. అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం బొల్లం పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మౌనిక (17) ను తల్లి మందలించడంతో మనస్తాపం చెంది క్రిమిసంహారక పురుగుల మందు తాగింది. ఇది గమనించిన తల్లి హుటాహుటిన సూర్యాపేటలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి సోదరి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed